thalari Rangaiah:

సిరాన్యూస్,కళ్యాణదుర్గం
మెడిసిన్ సిద్దం చేసుకోండి
* ఎంపీ తలారి రంగయ్య
* పశు వైద్యులతో స‌మీక్ష‌
పశువుల ఆరోగ్యాలకు సంబంధించిన మెడిసిన్ సిద్దంగా చేసుకోవాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. బుధ‌వారం కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పశు వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సంద‌ర్బంగా ఎంపీ తలారి రంగయ్య వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలు, పశు భీమా ఇన్సూరెన్స్ పై అధికారులతో చర్చించారు .పశువుల ఆరోగ్యాలకు సంబంధించిన మెడిసిన్ సిద్దంగా చేసుకోవాలని పశువులు చనిపోయిన వెంటనే వాటికి ఇన్సూరెన్స్ తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *