సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
వెన్న చర్ల గ్రామ ప్రజలు జూపల్లి కృష్ణారావు గెలుపు కోసం.గ్రామ ప్రజలందరూ.పని చేసినందుకు ధన్యవాదములు గ్రామపంచాయతీ నుండి వెన్న చర్ల గ్రామ బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి అక్కడ సభను ఉద్దేశించి.ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ.గ్రామంలో ప్రజల, కష్ట సుఖాలు, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి సమయంలోనైనా అందరి కోసం పనిచేయడం జరిగింది.అలాగే గ్రామ అభివృద్ధి కోసం మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మా మీద నమ్మకంతో….. మన గ్రామ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.గ్రామ అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడ్డారు.అని అన్నారు.వెన్న చర్ల గ్రామంలో డబల్ సిసి రోడ్డు, గ్రామపంచాయతీ బిల్డింగు బీసీ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్, వెటర్నరీ బిల్డింగు , గ్రంథాలయం బిల్డింగు మీసేవ బిల్డింగు ఆర్టిసి బస్టాండ్ బిల్డింగు రైతు వేదిక, స్కూల్ బిల్డింగులు, మంచినీటి సమస్య కోసం బాధపడుతున్నటువంటి మన గ్రామ ప్రజల కోసం.దాదాపుగా మన గ్రామంలో మహిళలు దారి పొడవునా కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీటి కోసం వెళ్లి బారులు తీరి.వాటర్ ట్యాంకీలతో వాటర్ తెచ్చుకొని తాగుతున్న రోజుల్లో.మేము కష్టపడి దాదాపుగా *ఆరు బోర్లు వేసి మన గ్రామానికి మంచినీటి సమస్య తీర్చాము. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా,ఎంత దూరమైనా వెళ్లి.అందరి బాగు కోసం పనిచేసేటటువంటి మమ్మల్ని విశ్వసించకపోవడం మాకు చాలా బాధనిపించింది అని తెలిపారు. మమ్మల్ని అన్ని గ్రామాల.నాయకులు.నమ్మి.మన నాయకత్వాన్ని బలపరుస్తుంటే మన గ్రామంలో బలహీనపరచడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. ఇలాంటి విషయం ఎప్పుడూ కూడా మళ్ళీ పునరావృతం కావద్దని.అలాగే ఎవరు ఓటు వేసినా.ఓటు వేయకపోయినా అందరూ నా వాళ్ళే అనే.సద్భావన గుణంతో నడుచుకుంటామని తెలియజేసారు. గ్రామ ప్రజలు ఇప్పటినుంచి అయినా.మా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంచి.మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా విశ్వసిస్తాము. కావున రాబోయే రోజుల్లో మన గ్రామానికి ఇంకా అభివృద్ధి వైపు నడిపిస్తాం,కావున మా నాయకత్వం మీద ఖచ్చితంగా నమ్మకం ఉంచాలని… అలాగే గ్రామ ప్రజలందరి అభివృద్ధికి కృషి చేస్తాము విజ్ఞప్తి చేశారు…ఈ కార్యక్రమం లో *గ్రామ సర్పంచ్ డి.రాధ బాలస్వామి, ఎంపీటీసీ డి. రవికుమార్, మాజీ డిప్యూటీ సర్పంచ్ జి. పర్వతాలు,గ్రామ కోఆప్షన్ మెంబెర్ జమ్ముల శ్రీధర్ రెడ్డి, వార్డ్ మెంబెర్ బై రాముడు, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.