రైతులకు అండగా పొలం పిలుస్తోంది

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం దర్శిపరు గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమం లో
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం లో 2024వ సంవత్సరం ఖరీఫ్ లో 20,302 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పంట బుకింగ్ కింద రైతులు తాము వేసిన పంటలను వ్యవసాయ శాఖ ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా నమోదు చేయించుకోవాలని అలాగే ఈ ఖరీఫ్ పంటకాలానికి అన్ని రకాల ఎరువులను కలిపి 5293 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 1423 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు పెంటపాడు మండలంలో అందుబాటులో ఉన్నాయని, ఎరువుల లభ్యతకు ఎటువంటి కొరత లేదని తెలియజేశారు. అలాగే ఎలుకల నియంత్రణ గురించి మాట్లాడుతూ పెంటపాడు మండలానికి 13 కిలోల బ్రొమోడియోలిన్ రసాయనాన్ని రైతులకు ఉచితంగా 100% సబ్సిడీపై సరఫరా చేయడానికి తగు చర్యలు తీసుకున్నా మని తద్వారా 20,302 ఎకరాల్లో ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి తగు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. పొలంబడి కార్యక్రమం కింద సెప్టెంబర్ 24వ తేదీ నుండి మొదలుపెట్టి ప్రతి మంగళ మరియు బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పంటల ఉత్పాదక పెంపొందించడానికి ఆర్థికంగా లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం మరియు పరిజ్ఞానంతో రైతులకు సాధికారత కల్పించేందుకు వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు.

ఇన్ పుట్ సబ్సిడీ కింద ఖరీఫ్ 2024 జూలై మాసంలో కురిసిన అధిక వర్షాలకు 1086.49 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని దీని నిమిత్తం 1.84 కోట్ల రూపాయలు ఇన్ పుట్ సబ్సిడీ 2297 మంది రైతులకు అందజేయడం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, అలాగే ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 23.2 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని దీని నిమిత్తం 3.94 లక్ష రూపాయలు ఇన్ పుట్ సబ్సిడీ 39 మంది రైతులకు అందజేయడం కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు 2236 మంది రైతులు గాను 1.88 కోట్ల రూపాయలు ఇన్ పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది అని చెప్పారు. సిసిఆర్సి కార్డులు పెంటపాడు మండలంలో 2024 -25 వ సంవత్సరానికి సంబంధించి 9150 సిసిఆర్సి కిట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు 8263 సీసీఆర్సి కార్డులు కౌలు రైతులకు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే 2024 -25 వ సంవత్సరానికి సంబంధించి కౌలు రైతులకు రైతు మిత్ర గ్రూపులు మరియు జాయింట్ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఎప్పటి వరకు 470.40 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారుఈ కార్యక్రమంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం గురించి రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువచేయడం కోసం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన, క్షేత్రస్థాయి సమస్యలకు తక్షణ పరిష్కారం గురించి, తక్కువ పెట్టుబడి అధిక ఉత్పత్తి గురించి అదేవిధంగా తద్వారా ఎక్కువ నికరదాయం దిశగా ప్రోత్సహించడం కోసం, రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు గురించి, డ్రోన్ దీదీ పథకం కింద రైతులకు సేవలు అందించే నిమిత్తం 15 వేల మంది మహిళా మహిళా గ్రూపులకు డ్రోన్లు అందించే కార్యక్రమం గురించి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్శిపర్రు గ్రామ రైతులు, గ్రామ సర్పంచ్,పుల్ల బాబి ,పాలూరి వెంకటేశ్వరరావు, దాసరి అప్పన్న కిలపర్తి వెంకట్రావు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *