సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం నాడు అరగంట పాటు వర్షం దంచుకొట్టడంతో వరి ధాన్యం తడిచిపోయింది. రోడ్లపై, కల్లాల్లో ధాన్యం అరబెట్టడంతో వరి వరదకు కొట్టుకుపోయింది. రైతులు, రైతు కుటుంబసభ్యులు ధాన్యం రాశుల్లో నీటిని తీసేందుకు శ్రమించారు. వర్షంలోనే ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.