సిరా న్యూస్, భీంపూర్:
తుడుందెబ్బ నూతన కమిటీకి ఘన సన్మానం..
తుడుం దెబ్బ నూతన కమిటీ సభ్యులను ఆదిలాబాద్ పట్టణం మావల మండలంలోని కొమురం భీం కాలనీలో నాయకులు ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నుకోబడిన తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ గొడం గణేష్, సహాయ కార్యాదర్శి రేణుకలను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఈ నెల 14న హన్మకొండలో తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో, కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుర్స పొచ్చయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. యువ నాయకత్వానికి అవకాశమిచ్చిన ప్రతీ ఒక్కరికి వాదు ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఆదివాసీ ఉద్యమ బలోపేతానికి తాము కృషీ చేస్తామని అన్నారు. తుడుందెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శివెట్టి మనోజ్, మహిళ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు గొడం జంగుబాయి, మహిళ సంఘం జిల్లా ఉపాద్యాక్షులు సోయం లలిత, నాయకులు కుడ్మెతే ప్రకాష్, ఆత్రం గణపతి, కుమ్ర శాంత బాయి, దుర్వా జుగదిరావు, మడావి అనసూయ, మంగవతి కుమ్ర, తదితరులు పాల్గొన్నారు.