సిరా న్యూస్, ఆదిలాబాద్:
జైనథ్లో వెసక్టమీపై అవగాహణ..
ఈ నెల 18 నుండి 24 వరకు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్లో నిర్వహిస్తున్న వెసక్టమీ క్యాంప్ను అర్హులంత సద్వినియోగం చేసుకోవాలని జైనథ్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నైనత, గిమ్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సుచల అన్నారు. గురువారం రెండు పీహెచ్సీల్లో వెర్వేరుగా వెసక్టమీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పురుషులు కూడ చేసుకోవచ్చని, వెసక్టమీ గురించి ఎలాంటి అపోహలు పెంచుకోవద్దని అన్నారు. గ్రామాల్లో ఈ క్యాంప్ గురించి విస్తృతంగా ఆవగాహన కల్పించాలని కోరారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో అంజయ్య, సూపర్వైజర్లు వేణుగోపాల్, అనిత, అక్తర్ హుస్సేన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.