సిరా న్యూస్, కుందుర్పి
వైసీపీ నాయకుడు జగదీశ్ పై గొడ్డలితో దాడి
వైసీపీ నేతపై టీడీపీ నాయకుడి దాడి చేసిన ఘటన కుందుర్పి మం తూముకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు ఇలా ఉన్నాయి.. పైప్ లైన్ విషయంలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నాగభూషణం, వైసీపీ నాయకుడు జగదీశ్ గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో జగదీశ్ తో పాటు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.