సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ ఆర్.జి ఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతం రాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని మెలుహ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దాంతోవ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు.మృతుడి వివరాలు తెలియరాలేదు. విద్యార్థులను స్కూలుకు తీసుకురావడానికి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అజిత్ నగర్ లోని మెలుహ స్కూల్ బస్ గా గుర్తించారు.