ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య

 సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి – మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్, సంధ్య మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్లో చనిపోయాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంథనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంథనికి చేరుకొని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *