Adivasi leader Kinaka Suresh: సాత్నాల‌ మండల సాధ‌న కోసం 22న రౌండ్ టేబుల్ సమావేశం:  ఆదివాసీ నాయకులు కినక సురేష్

సిరాన్యూస్‌,జైనథ్
సాత్నాల‌ మండల సాధ‌న కోసం 22న రౌండ్ టేబుల్ సమావేశం:  ఆదివాసీ నాయకులు కినక సురేష్

ఈనెల 22న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాల‌ని ఆదివాసీ నాయకులు కినక సురేష్ అన్నారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలోని సాత్నాల‌ మండల కేంద్రం లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈసమావేశంలో ఆదివాసీ నాయకులు కినక సురేష్ , కొడప సోనేరావు, కుర్సెంగా తానజీ, పెందోర్ మోహన్‌లు హాజరయ్యారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ సాత్నాల మండలం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం కవస్తున్న ఇప్పటివరకు భవన నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. అధికారులను కూడా నియమించకుండ కాలయాపన చేస్తున్నారన్నారు. అందుకని సాత్నాల‌ మండల సాధన కోసం ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించాలని ఈ నెల 22న‌ సాత్నల మండల కేంద్రం లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని తెలిపారు. ఈరౌండ్ టేబుల్ సమావేశం లో నూతన మండల సాధన సమితి ని ఎన్నుకోవడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ ,శ్రీరామ్, బషీర్, యశ్వంత్, లింగు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *