DCCB Chairman Addi Bhoja Reddy: ప్ర‌జ‌ల‌ను బీజేపీ త‌ప్పు దోవ ప‌ట్టిస్తోంది: డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్ :
ప్ర‌జ‌ల‌ను బీజేపీ త‌ప్పు దోవ ప‌ట్టిస్తోంది: డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి
* బీజేపీ ,బీఆర్ఎస్ నాయ‌కుల‌పై ఆగ్ర‌హం
* రైతుల‌ను రెచ్చ గొట్టే చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు
* ఒక్క ఇల్లు పోయినా త‌మ‌దే బాధ్య‌త‌

రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీల‌ను ఎనిమిది ఎమ్మెల్యేల‌ను గెలిపించిన తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా రుణ‌మాఫీ , రైతు భ‌రోసా పై బీజేపీ అనుస‌రిస్తున్న విధానాన్ని డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి త‌ప్పు బ‌ట్టారు. మంగ‌ళ వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మ‌ట్లాడారు.కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర రాజ‌ధానిలో లో ధ‌ర్నాలు చేయ‌డం సిగ్గు చేట‌న్నారు.రాష్ట్ర ప్ర‌జ‌లు చూసి న‌వ్వుతున్నార‌న్నారు. ప‌దేళ్లు అధ‌కారంలో ఉండి ప్ర‌స్తుతం అధికారంలో కొన‌సాగుతున్న కేంద్రం లోని బీజేపి ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేసారు. ఇక్క‌డ రాష్ట్రంలో గతంలో ప‌దేళ్ళు అధికారం వెల‌గ‌బెట్టిన బీఆర్ఎస్ నాయ‌కులు కూడా ఈ విష‌యం పై మాట్ల‌డ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.ఏవైతే సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్ల రుణ మాఫీ జ‌ర‌గ‌లేదో వారంద‌రికి మ‌రో ప‌ది రోజుల్లో ఖాతాలో ప‌డే ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని మంత్రులు తెలిపార‌న్నారు. అలాగే న‌వంబ‌ర్ నుండి రైతు భ‌రోసా కూడా ప్రారంభమ‌వుతుంద‌ని చెప్ప‌డం రైతుల‌పై ప్ర‌భుత్వానికున్న చిత్తశుద్దికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కాని దీనిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేసి రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రి కాద‌న్నారు. చెరువులు, ఎఫ్ టీఎల్, బ‌ఫ‌ర్ జోన్ ల‌లో 28వేల క‌ట్ట‌డాలు జ‌రిగాయ‌ని బీఆర్ఎస్ నాయ‌కులు కేటీఆర్ , హ‌రీష్ రావులు హైడ్రాను ఒక బూచిగా చూపించి ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతు ల‌కు గురి చేస్తూ వారిని రెచ్చ గొడుతున్నార‌న్నారు. ఆదిలాబాద్ ఖానాపూర్ లోనూ చెరువు ప‌క్క‌న గ‌ల నివాసితులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌క్క‌ర‌లేద‌న్నారు. ఒక్క ఇల్లు పోయినా త‌మ‌దే బాధ్య‌త అన్నారు. ప్ర‌జ‌లు , రైతులు కూడా వాస్తవాలు గ్రహించాల‌న్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయ‌కుల అబ‌ద్ద‌పు మాట‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని ఇలాగే త‌మ నాయ‌కుల‌పై ప్ర‌భుత్వానిపై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తే రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతార‌న్నారు. స‌మావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,ఎం.ఏ షకీల్,లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్, వైస్ ప్రెసిడెంట్ సోనియా మంథని,నాయకులు పోరెడ్డి కిషన్,మహిళా నాయకురాలు నేరెళ్ల లక్ష్మి,ఖమర్ బేగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *