సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
రాష్ట్ర వ్యాప్తంగా అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు నెల నెల చెల్లించాల్సిన పెరిగిన వేతనాలను నెల నెలా కాకుండా ఒక నెల టీచర్ శాలరి, ఒక నెల హెల్పర్ శాలరి చెల్లించడాన్ని నిరసిస్తూ తెలంగాణా అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…. అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి ఎందుకు చెల్లించరని, సాకులు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. ఒక నెల పెంచిన జీతం ఇస్తూ మరొక నెల పాత జీతం చెల్లించడం అన్యాయమని అని అన్నారు. సమస్య పరిస్కారం కొరకు అన్ని స్థాయిల అధికారులను కలిసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగామని అని అన్నారు. అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు తక్షణమే హెల్పర్లను కేటాయించాలని, పని భారం తగ్గించాలని, బిఎల్ఓ ల పేరిట వేధింపులు ఆపాలని అన్నారు. జీతాలు చెల్లించే విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.