సిరా న్యూస్, ఆదిలాబాద్
సాత్నాల ప్రాజెక్ట్ నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
సాత్నాల ప్రాజెక్ట్ ఆధునికరణ కోసం 19 కోట్ల ప్రతిపాదన
* హర్షం వ్యక్తం చేసిన రైతులు
రైతుల కోరిక మేరకే సాత్నాల ప్రాజెక్టు నుండి ఎడమ, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు నుండి, అధికారులు, రైతులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్లో రైతులకు సాత్నాల ప్రాజెక్టు నుండి నీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పత్తి పంటకు నీరు కావాలని రైతులు కోరిక మేరకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. సాత్నాల ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూపాయలు 19 కోట్ల ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు వస్తే పెన్నీలున్న పనులతో పూర్తి చేసుకుని అవకాశం ఉందన్నారు. రైతులు బాగుండాలి వారి ఇబ్బందులు దూరం కావాలని లక్ష్యంతోనే బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా ను రైతులకు అమలు చేయాలని అసెంబ్లీ సమావేశంలో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. విషయంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి, వర్షం, అధిక తేమ శాతం ఉండడంవల్ల ఫసల్ బీమా ద్వారా రైతులకు ఎకరానికి ప్రతి సంవత్సరం రూపాయలు 20,000 నుండి 24 వేల వరకు అందే అవకాశం ఉందన్నారు. ఫసల్ బీమా ఈ సంవత్సరం అమలు చేస్తామని చెప్పిన సీఎంకు జిల్లా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు రాందాస్, ఆదినాథ్, రమేష్, దయాకర్, సుభాష్, సంతోష్, లింగు పటేల్, స్వామి, ముకుంద్, అశోక్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు