Farmers Training: పసుపు రైతులు సంఘటితం కావాలి…

సిరా న్యూస్, ఖానాపూర్:

పసుపు రైతులు సంఘటితం కావాలి…

పసుపు రైతులంతా సంఘటితమై, సంఘాలుగా ఏర్పడితే ఎన్నో లాభాలు పొందవచ్చని సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్, సీనియర్ అధికారి రాజామాణిక్యం అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలం సత్తన్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో ఆదిలాబాద్ గిరిజన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపు నాణ్యత ప్రమాణాలు, సాగు యాజమాన్య పద్ధతులు, మెలకువలు, పంట కోత యాజమాన్య పద్ధతులు, పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు, పసుపు యొక్క నూతన వంగడాలు, సాంకేతిక పద్ధతులు, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే పద్ధతులు, రైతు ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీలు, వివిధ పథకాల గురించి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెటింగ్ అవకాశాలు, విలువ ఆధారిత పద్ధతులు, అవకాశాలు, పసుపు కొనుగోలుదారులు, అమ్మకం దారుల వేదికలను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పసుపు రైతులు సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి నూతన పసుపు వంగడాల గురించి తెలుసుకోవడమే కాకుండా మెరుగైన యాజమాన్య పద్ధతులు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పసుపులో అధిక దిగుబడులతో పాటు మంచి మార్కెటింగ్ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో సుమన్ కుమార్, కంపెనీ వైస్ చైర్మన్ బోసు నారాయణ, ఉప సర్పంచ్ రాజమల్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎల్లిబాయి కమల, సెడం లక్ష్మణ్, భుజంగరావు, కొరటికల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సామల భీమారెడ్డి శ్రీధర్ రెడ్డి, సిబ్బంది శంకర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రాఖేష్, సాయి ప్రియ, సింగపూర్ సర్పంచ్ రామకృష్ణ, తదితరులు పాల్గన్నారు.

One thought on “Farmers Training: పసుపు రైతులు సంఘటితం కావాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *