అక్రమ సంబంధమే అంతం చేసింది
సిరా న్యూస్,శంషాబాద్;
మూటలో మహిళను చంపి ఆమె శవాన్ని బ్లాంకెట్లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో డ్రైనేజీ పక్కన పడేసిన మహిళా హత్య కేసు మిస్టరీలో షాద్ నగర్ పోలీసులు పురోగతి సాధించారు. కేవలం మూడు రోజుల్లోనే కేసులోని మిస్టరీని ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన “మూటలో మహిళా శవం” హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసిపి ఎన్.సిహెచ్ రంగస్వామి మంగళవారం మీడియాకు వెల్లడించారు.
చెడు వ్యసనాలే ప్రమాదకరం
గత నెల 27వ తేదీ రాత్రి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కన్నా భాగ్యలక్ష్మి అలియాస్ లక్ష్మి (40) హత్యకు గురైంది. ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్ లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఓ డ్రైనేజ్ పక్కన మూటగట్టి పడేశారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. చెడు వ్యసనాలకు అలవాటు పడి దురాశతో కన్నా భాగ్యలక్ష్మిని గద్వాల జిల్లా చాగాపురం గ్రామానికి చెందిన వడ్డే పరమేష్ (43) ఆమెతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అరతులం బంగారం కోసం ఆశపడి ఆమెను గొంతు పిసికి హత్య చేశాడని ఏ ఏసీపీ వివరించారు.
కన్నా భాగ్యలక్ష్మి 27వ తేదీ రాత్రి 10 గంటలకు వడ్డే పరమేష్ తో కలిసి ఇంటికి చేరుకుంది. అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ భాగ్యలక్ష్మి రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసిన అనంతరం 11 గంటల సమయంలో నిందితుడు వడ్డే పరమేష్ భాగ్యలక్ష్మి గొంతు పిసికి అరవకుండా ఆమె నోరు మూసి హత్య చేశాడు. తరువాత ఆమె చెవి కమ్మలు, పూస్తే, 5000 రూపాయల నగదు దోచుకుని ఫ్యాషన్ బైక్ పై వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె శవాన్ని ఒకరగ్గులో చుట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని డ్రైనేజీ పక్కన పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అనేక సీసీ కెమెరాలు పరీక్షించి ఆ తర్వాత కొన్ని ఆధారాలతో నిందితుడు అద్దెకు ఉంటున్న యాదవ కాలనీలో ఓ ఇంట్లో వడ్డే పరమేష్ ను గుర్తించినట్టు తెలిపారు. సాంకేతిక ఆధారాలు ఇతర ఆధారాలతో వడ్డే పరమేష్ ను అదుపులోకి తీసుకొని ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు.
=======================xxx