సిరా న్యూస్,ఆదిలాబాద్;
ఆదిలాబాద్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్ల ను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఫటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదుగురుమృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రిమ్స్ కు తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12) గా గుర్తించారు. మృత్తులంతా ఆదిలాబాద్ పట్టణం లోని టీచర్స్ కాలనీ కు చెందిన వారు. భైంసా లో ఓ కార్యక్రమానికి హాజరై తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగింది.