సిరా న్యూస్;
హిజ్ బొల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పశ్చిమసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సిరియాపై అమెరికా దాడులు మొదలు పెట్టింది. అమెరికా బలగాలు సిరియా పైన విరుచుకుపడుతున్నాయి. ఇప్పటివరకు తాము జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా వెల్లడించింది. వీరంతా కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందిన వారిని వివరించింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నాయకులు ఉన్నారని పేర్కొంది.. ఆల్ ఖైదా కు అనుబంధంగా ఉన్న హుర్రాస్ ఆల్ దీన్ గ్రూప్ కు చెందిన సీనియర్ ఉగ్రవాది.. మరో ఎనిమిది మందిని టార్గెట్ గా అమెరికా దాడులు చేసింది. వాయవ్య సిరియా ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 37 మంది హతమయ్యారు. అందులో ఓ సీనియర్ ఉగ్రవాది అమెరికాకు వ్యతిరేకంగా… ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు చెందిన ఫైటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. అయితే తమ నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం తెలియడంతో అమెరికా అప్రమత్తమయింది. వెంటనే దాడులకు రంగం సిద్ధం చేసింది. అత్యధిక ఆయుధ సామగ్రితో వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ శక్తి సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అమెరికా వెల్లడించింది. ” మా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. మిత్రపక్షలకు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తే సహించేది లేదు. ప్రపంచ వ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగించే పనులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాత్రమే కాదు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎవరికైనా ఇదే గతి పడుతుందని” అమెరికా హెచ్చరించింది. అయితే సిరియా నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ భారీగా భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఇటీవల మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు అమెరికాకు సమాచారం అందింది. దీంతో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విస్తరించకుండా ఉండడానికి అమెరికా దాడులు మొదలు పెట్టింది. ఏకంగా 37 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ప్రకటించింది. అమెరికా దాడులు నేపథ్యంలో సిరియాలో దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అక్కడ వారు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఉగ్రవాదులను హతమార్చుకుంటూనే.. బంకర్లు, సెల్లార్లు, ఇతర నిర్మాణాలలో ఉగ్రవాదుల జాడ కోసం తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా అటు హిజ్ బొల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తుండడం.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులను ఏరి పారేయడానికి అమెరికా సిరియాపై దాడులు చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత ఇజ్రాయిల్ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి..హెజ్ బొల్లా ను కోలుకోకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ను హతమార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని హెజ్ బొల్లా అధికారికంగా ఇంతవరకూ ధృవీకరించలేదు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం అంతకంతకు దూకుడు కొనసాగిస్తోంది. బాంబుదాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో హెజ్ బొల్లా కు పరోక్షంగా అండదండలు అందించిన ఇరాన్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇజ్రాయిల్ తో గత అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. లెబ నాన్ రాజధాని బీ రూట్ లో హెజ్ బొల్లా ప్రధాన కార్యాలయం పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులలో హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయినట్టు తెలుస్తోంది.. దీనిని ఇజ్రాయిల్ రక్షణ విభాగం ఇప్పటికే ధ్రువీకరించింది. హెజ్ బొల్లా చీఫ్ ఆ సమయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు ఇజ్రాయిల్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో మరో మాటకు తావులేకుండా బాంబులతో దాడి చేసింది. బాంబుల దాడి వల్ల భవనం పూర్తిగా నేలమట్టం అయింది. ” మేము అనుకున్న లక్ష్యం పూర్తయింది. భవనం పూర్తిగా నేలమట్టం అయింది. నస్రల్లా ఇకపై భయభ్రాంతులకు గురి చేయడు. ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టలేడు.. అతడు ఇక గతం తాలూకు జ్ఞాపకమే” అంటూ ఇజ్రాయిల్ వార్ రూమ్ ప్రకటించింది..”ఆపరేషన్ న్యూ ఆర్డర్” మిషన్ విజయవంతమైన ప్రకటించింది.నస్రల్లా కన్నుమూసిన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హెజ్ బొల్లా తన మిత్రపక్షలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.. ఇజ్రాయిల్ వరుసగా దాడులు చేస్తున్న నేపథ ఖమేనీ అత్యవసరంగా తన నివాసంలో సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఒక సందేశం విడుదల చేశారు..”హెజ్ బొల్లా కు అండగా ఉండాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఈ ప్రాంతం భవిష్యత్తును దూకుడుగా ఉన్నవారు నిర్ణయిస్తారు.. అందులో హెజ్ బొల్లా మొదటి స్థానంలో ఉంటుందని” ఖమేనీ తన సందేశంలో పేర్కొన్నారు.. కాగా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో హెజ్ బొల్లా కు తీవ్ర నష్టం వాటిల్లుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్ తో తలపడే అవకాశం కనిపిస్తోంది..లెబనాన్ కు తన దళాలను పంపిస్తోంది..”1981 మాదిరిగానే ఇజ్రాయిల్ దేశంతో నేరుగా పోరాడేందుకు తమ బలగాలను లెబ నాన్ కు పంపిస్తామని” ఇరాన్ ఉన్నతాధికారి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.