అస్పియా మృతిపై స్పందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

సిరా న్యూస్,పుంగనూరు;
పుంగనూరులో అస్ఫియా మృతికి గల కారకులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటరి ఎంపీ వెంకట మిథున్ రెడ్డి చిన్నారి అస్పియా కుటుంబీకులను పరామర్శించారు. చిన్నారిని హతమార్చిన హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన తెలిపారు. పుంగునూరు పట్టణంలో ఇంతటి దారుణం ఎన్నడు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అస్ఫియా మృతి రాష్ట్రవ్యాప్తంగా అందరి మనసులను కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా అదృశ్యమై 3 రోజులు గడిచిన ఒక్క సిసి పుటేజి కూడా పోలీసులు సేకరించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషులను త్వరితగతిన గుర్తించకపోతే పోలీసుల అసమర్ధతపై తప్పకుండా స్పందిస్తామని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *