కులగణన ద్వారా బలహీన వర్గాల అభివృద్ది

సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్ధాయి బీసీ కుల గణన & సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పార్టీ విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహేందర్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి, తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ తరువాత దేశంలోనే తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న కులగణన అణగారిన, వెనుకబడ్డ వర్గాల అభివృద్ధికి, రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం అందించేందుకు దోహదపడుతుందని మహేందర్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్టీ రామారావు కాలంలో బీసీలు, బలహీన వర్గాలకు సముచితమైన స్థానం అందించి వారి గౌరవాన్ని పెంపొందించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *