సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులైన వెయ్యి కుటుంబాలకు ఒక్కొక్క కుంటుబానికి 10 కేజీల చొప్పున్న బియ్యం ప్యాకెట్లును పంపిణీ చేయాలని విజయవాడకు లారీలో బియ్యం ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేతలు తెలిపారు.
ఈ సందర్భంగా గురు రాజ విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ రేపు నంద్యాల జిల్లా మంత్రులైనా ఎన్.ఎం.డి ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో విజయవాడలోని వరద బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.