Huzurabad ACP Srinivas: దుర్గామాతను దర్శించుకున్న హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్

సిరా న్యూస్, సైదాపూర్:
దుర్గామాతను దర్శించుకున్న హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్

సైదాపూర్ మండలం అరెపల్లి గ్రామంలోని కొలువైన దుర్గామాతను హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు ప్రశాంతమైన వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవాలని దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా యువత సహకరించాలని, శాంతిభద్రతలకు ఆటంకాలు కలిగించకూడదని కోరారు. కార్యక్రమంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంగళ ప్రశాంత్, ఉపాధ్యక్షులు గొంగళ్ళ కుమార్, ఉత్సవ కమిటీ కోశాధికారి దూమల శ్రీధర్, కమిటీ సభ్యులు ఉపేందర్, రాజ్ కుమార్, మహేష్, విజయ్, సంతోష్, కరీంనగర్ జిల్లా ఆరెకుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వర్ని మోహన్ రావు, ఆరెపల్లి ఆరెకుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వరికెల శ్రీనివాస్, గర్రెపల్లి ఆరెకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దోకిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *