పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి
నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా
నన్ను గెలిపించండి మీ జీవితాలు మలుపు తిప్పుకోండి..
సిరా న్యూస్,జమ్మికుంట;
– జమ్మికుంట : కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని లోటస్పాండ్ పాఠశాలలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పక్షాన గుజ్జ తిరుపతిరావు, ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేందర్ రెడ్డి, మాట్లాడుతూ 2021 లోపు డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు అందరూ ముందుగా ఓటర్ నమోదు చేసుకోవాలని, అలాగే గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో కృషి చేస్తున్న నాకు మీరంతా సపోర్ట్ చేయాలని, నన్ను గెలిపించినట్లయితే నిరుద్యోగుల పక్షాన తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఆల్ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తానని, ప్రశ్నించే గొంతుకతో పాటు నిరుద్యోగుల పక్షాన పరిష్కారం చూపే మార్గదర్శకుడిని అవుతానని, రాజకీయాలు వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సేవా దృక్పథంతో ముఖ్యంగా విద్యావంతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని, నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరూ నా యొక్క అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల అధినేతలు డా.పుల్లూరి సంపత్ రావు, మహమ్మద్ అంకూస్, మహమ్మద్ రహమాన్, కొండ విజయ్, జమ్మికుంట పరిసర ప్రాంత పట్టభద్రులు పాల్గొన్నారు..