సంక్రాంతి తర్వాత జోడోయాత్ర 2

సిరా న్యూస్,న్యూఢిల్లీ;

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు “భారత్ న్యాయ్ యాత్ర” అనే పేరు పెట్టారు. మణిపూర్ నుంచి ముంబయి వరకూ రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. భారత్‌ జోడో యాత్రలో ఎదురైన అనుభవాలతో రెండోసారి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సారి యువత, మహిళలతో పాటు అన్ని వర్గాలతోనూ ఆయన మాట్లాడతారు. మొత్తం 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌, నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ మీదుగా యాత్ర సాగుతుంది. చివరకు మహారాష్ట్రలో ముగుస్తుంది. ఈ సారి కాలినడకనే కాకుండా బస్‌లో యాత్ర కొనసాగుతుంది.”
గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేశారు. అయితే…ఫస్ట్ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో సాగనుంది. అంటే…కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు.ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా పడింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ మరోసారి ఆత్మపరిశీలనలో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్ర నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *