సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
లక్ష్మణ్ కుటుంబానికి రూ.25వేలు అందజేత : కాల్వశ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన భూషణవేనా లక్ష్మణ్ ఇటీవల నోటి క్యాన్సర్తో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న కాల్వశ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు ( 1999-2000, 10వ తరగతి మిత్ర బృందం) శనివారం లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. తమ వంతుగా సేవ దృక్పధం తో రూ. 25వేలు ఆర్థిక సహాయం చేశారు.