కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్క పద్మశాలి కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం హడాక్ కమిటీ అధ్యక్షులు వలస నీలయ్య పేర్కొన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ వద్ద లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడిన మహోన్నత వ్యక్తిని అన్నారు. హైదరాబాదులో తన సొంత ఆస్తి జల దృశ్యం తన భవనాన్ని తెలంగాణ కోసం అంకితం ఇచ్చిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. పద్మశా లి కుల అభివృద్ధి కోసం హైదరాబాదులో రాజ్ మహల్ భవనం నిర్మాణం చేపట్టి పద్మశాలీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగిన వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం గర్వకారణం అన్నారు. రాను న్న రోజుల్లో పద్మశాలీల ఐక్యతకు కృషి చేశారన్నారు. రాజకీయంగా ఆర్థికంగా పద్మశాలీలు అభివృద్ధి పదములో పయనించేలా సహాయ సహకారాలు అందించుకొని ముందుకు సాగుదాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిపల్లి సదానందం, అడా కమిటీ సభ్యులు డి వి ఎస్ మూర్తి, పెగడ చందు, జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి రాజేష్, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలల అధ్యక్షులు చిప్ప భాస్కర్, గుండా మురళి, కామణి రాజేశం, కొండి సతీష్ కుమార్, మామిడి కనకరాజు, ఆడెపు శంకరయ్య, కొండ బత్తుల మల్లేశం, ఆడెపు కనకయ్య,. దిడ్డి సత్యనారా యణ, అడిచెర్ల లక్ష్మణ్, దిడ్డి రాజయ్య, బూర్ల ధనుంజయంలతోపాటు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *