సిరాన్యూస్, కళ్యాణదుర్గం
మహిళలు ఆర్ధికంగా ఎదగాలి : ఎమ్మెల్యే సురేంద్రబాబు
* కార్యకర్తలకు అండగా ఉండేందుకే సభ్యత్వాల నమోదు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయడం తద్వారా మహిళలు స్వయం శక్తితో వివిధ చేతివృత్తుల ద్వారా ఆదాయం సంపాదించి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు.సోమవారం టీ సర్కిల్లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సంఘాల వారు చేతివృత్తులతో తయారు చేసిన వివిధ రకాల వస్తువుల విక్రయం అర్బన్ మార్కెట్ నుఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు నాగేశ్వర్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా ఋణాలు తీసుకుని చేతివృత్తులు, ఇతర వ్యాపారాలు చేస్తున్నారాని వారి వద్ద నాణ్యమైన వస్తువులు ఉంటాయని వాటిని మన ప్రాంత ప్రజలు కొనుగోలు చేయడం ద్వారా వారిని మనం ఆదుకోవచ్చన్నారు. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉండాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందు ఒక కమిటీ ఏర్పాటు చేసి, అందుకు అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు కోసం పనిచేస్తున్నారని, ఇక కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల భీమా వర్తించేలా కార్యకర్తల సంక్షేమ నిదిని ఏర్పాటు చేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో మన కళ్యాణదుర్గం సభ్యత్వాల నమోదులో 5వ స్థానంలో ఉందని 50 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసి మొదటి స్థానంలో నిలబడేలా అందరూ గ్రామస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ పరిశీలకుడు నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రాజకీయ పార్టీ కూడా తీసుకోలేని నిర్ణయంతో కార్యకర్తలకు అండగా ఉండేలా 5లక్షల భీమా, ఉపాధి, వైద్య, విద్యతో పాటు చనిపోయిన కార్యకర్త మట్టి ఖర్చులకు కూడా నగదు అందించేలా చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే 175 నియోజకవర్గాల కోటి సభ్యత్వాలు నమోదు చేసేలా అందరిని సంసిద్ధం చేశారన్నారు, కళ్యాణదుర్గం మొదటి స్థానంలో ఉండేలా ఇక్కడ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తమ నాయకులకు దిశానిర్దేశం చేసి ఆదిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.