సిరాన్యూస్,ఓదెల
రైతు ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం : ఎమ్మెల్యే విజయరమణ రావు
* సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
రైతు ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. శుక్రవారం ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో సింగిల్ విండో , ఐకేపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతల అనే పదానికి తావు ఇవ్వమని స్పష్టం చేశారు. సీజన్లో కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో ఎక్కడైనా కటింగ్ చేస్తే రైతులు తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రానికి వస్తానని రైతులకు హామీ ఇచ్చారు. సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని, రైతులు ఎలాంటి సందేహాలకు పాల్పడవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభ్యున్నతి కోసం పాటు పడుతుందన్నారు. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగిన ఉపేక్షించేది లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, తహసీల్దార్ బి.యాకన్న, ఏపిఎం సీఈఓలు , గోపు నారాయణ రెడ్డి, విజేందర్ రెడ్డి, బైరి రవి గౌడ్, ,సమా శంకర్ మాజీ సర్పంచ్ లు, కుంచం మల్లయ్య ఎంపీటీసీ లు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు