సిరా న్యూస్,రామగుండం;
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ అర్జీ వన్ జీఎం ఆఫీస్ ఎదుట కార్మికుల డిపెండెంట్లు నిరసన ప్రదర్శన చేశారు. మారు పేర్లతో విధులు నిర్వహించే కార్మికుల రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని ప్ల కార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల మారు పేర్లు, విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆందోళన చేపట్టారు. అంతేగాకుండా కార్మిక సంఘాల నాయకులు ఉపాధి కల్పించడంలో న్యాయం చేయాలని డిపెండెంట్స్ కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా… ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి లో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.