సిరా న్యూస్, ఓదెల
డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం : ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్
పెద్దపల్లి జిల్లాలోని ప్రయాణీకుల నుండి సలహాలు, సూచనల కోసం డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు చేపట్టనున్నట్లు మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఇంకా ఏ ఇతర అంశాలైన కూడా తెలియ జేయవచ్చునని, డిఎం శ్రావణ్ కుమార్ తెలిపారు.ఆర్టీసీ ప్రయాణికులు,ఈ సదవకాశాన్ని వినియోగించుకోవడం కోసం 7382825923 పోన్ నెంబర్ ను సంప్రదించాలని డిఎం తెలిపారు.