సిరాన్యూస్, ఆదిలాబాద్
నైపుణ్య అభివృద్ధికి డ్యూటీ మీట్ ల నిర్వహణ: ఎస్పీ గౌష్ ఆలం
ఆరు అంశాలలో పోలీసు సిబ్బందికి పరీక్షలు
* ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు, జోనల్ స్థాయికి ఎంపిక
పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క పనితనాన్ని మెరుగుపరిచేందుకు, పెంపొందించేందుకు జిల్లా స్థాయి జోనల్ స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ డ్యూటీ మీట్ నందు ముఖ్యంగా నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, విఐపి మూమెంట్, యాంటీ సబటిజ్ చెక్, డాగ్ స్క్వాడ్ యొక్క పనితనం, ఫింగర్ ప్రింట్ పై పరిశోధన, బాంబు డిస్పోజల్ టీం యొక్క విధులు, కంప్యూటర్ పై నైపుణ్యం, నేరా స్థలం నందు ఫోటోగ్రఫీ, అవాంఛనీయ సంఘటనలో సంభవించినప్పుడు వీడియోగ్రఫీ చేయు విధానం లాంటి అంశాలలో రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ,జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా స్థాయిలో నగదు రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలు కొన్ని అంశాలు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వారికి, మరికొన్ని అంశాలు ఏఎస్ఐ నుండి కానిస్టేబుల్ వరకు జరుగుతాయని తెలిపారు. జాతీయస్థాయిలో మొదటి, బహుమతి ద్వితీయ, బహుమతి తృతీయ, బహుమతి పొందిన వారికి జాతీయ స్థాయి నుండి అత్యధిక నగదు బహుమతిని లభించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి డ్యూటీ మీట్ లలో పాల్గొన్నప్పుడు తమకు ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రస్తుత సమాజంలో నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను తెలుసుకోవచ్చని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని, ట్రైనింగ్ నందు వాస్తవానికి ఉన్న భేదాలను గమనించవచ్చని, నేరం జరుగు పద్ధతులను పరిశోధించే పద్ధతులను వివరంగా అర్థం చేసుకొని తమ విధులను ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉన్నతాధికారులు మరియు అనుభవం ఉన్న అధికారుల ద్వారా నివృత్తి అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, బి సురేందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.