సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లాలో వందల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల అమ్మవారి ఆలయాలలో నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.జిల్లాలోని పిఠాపురం పాదగయలో శ్రీ రాజరాజేశ్వరి దేవి, అన్నవరం వనదుర్గ, కాకినాడ బాలా త్రిపుర సుందరి, సంత చెరువు కనకదుర్గ ,దేవాలయం వీధి బాల త్రిపుర సుందరి, సామర్లకోట బాలా త్రిపుర సుందరి, శ్రీపీఠం ఐశ్వర్యాంబిక, లోవ లోని తలంపులమ్మ ఇలా అన్ని దేవాలయాలలో పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
:ఆయా ఆలయాలలో రోజుకో అవతారం అమ్మవారికి చేస్తున్నారు. ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతున్నాయి. కేవలం కాకినాడ జిల్లా నుంచి కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు జిల్లాకు వస్తున్నారు. అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక మరో మూడు రోజులు మాత్రమే నవరాత్రులు ఉండడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోంది. అన్ని రహదారులు ఆలయాలకే దారితీస్తున్నాయి. ఆలయాలలో సాయంత్రం వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు భవానిమాలలు ఈసారి అధికంగా వేశారు. భవానీ భక్తుల పూజలతో, భజనలతో జిల్లా మార్మోగిపోతోంది.