విజయదశమి రోజున జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధం.

దేవర గట్టు
సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని దేవరగట్టు ఉత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు అధికార యంత్రాంగం చేసింది. దేవరగట్టులో యధావిధిగా పూజలు,కళ్యాణం, భవిష్యవాణి జరుగుతాయి. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న .ఎంతో ఆసక్తి కరంగా సాగే దేవరగట్టు ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 12 అర్ధరాత్రి జరిగే బన్నీ(కర్రల సమరం )నియంత్రణకై పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు,తపస్సులు చేస్తు ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మని మని..మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ లోక కల్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజ కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారని వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారని..మిమల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించగా మునులు వైకుంఠం కు వెళ్లి శరణు,, శరణు విష్ణు దేవా అంటూ వెళ్లి వేడుకున్నారు.మని మల్లసూరులు శివుని భక్తులని వారిని సంహరించడం తన వాళ్ళ కాదని మీరు పరమేశ్వరుడి వద్దకు వెళ్లాలని విష్ణుమూర్తి సూచించడం తో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కపాడలంటూ వేడుకున్నారు.దీంతో పరమేశ్వరుడు మనిమల్లాసురులను అంతమొందిస్తానని వారికి హామీ ఇచ్చాడని. హామీ ఇచ్చిన విధంగా పరమేశ్వరుడు కాల భైరవుడి అవతారం లో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగిస్తాడు.మని అనే రాక్షసుడిని అంతమొందిస్తాడు.ప్రాణాలు విడిచి సమయం లో తన చివరి కోరికను తీర్చాలని వేడుకుంటాడు.ఎం వరం కావల్లో కోరుకో అని శివుడు అడుగగా ఉత్సవాలకు వచ్చే కొందరి భక్తులను ఆహారంగా బలి ఇవ్వాలని కోరగా అందుకు పరమ శివుడు అంగీకరించి తథాస్తు అని చెప్పే సమయం లో పార్వతి దేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు అని భక్తులను బలి ఇవ్వడం కుదరదని వేరే వరం కోరుకోవాలని కోరింది.భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలని మనిమల్లాసూరులు కోరగా అందుకు పార్వతి దేవి అంగీకరించి ప్రతి ఏటా జరిగే దేవరగట్టు ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా రక్షపడి వద్ద వరం ఇవ్వడం తో అక్కడే రాక్షసులు ప్రాణాలు వదిలి నట్లు చరిత్ర చెబుతోంది.ఆ పిడికెడు రక్తం ఇచ్చేందుకు ప్రతి ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గొరవయ్యలు అడ్డుకునే ప్రయాత్నం చేయడం తో భక్తులు మాళమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి పూజారి దబ్బనం తో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు.వెంటనే బండారు పూసి డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ బన్నీ జైత్ర యాత్రలో జరిగే కర్రల సమరం లో కర్రల తో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందిచడం తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయంగా భావిస్తున్నారు.యుద్ధం జరిగే సమయం లో వెళ్తున్న పరమేశ్వరుడికి ముళ్ళు గుచ్చుకొని ముళ్ల బండ సేద దీరిన ప్రాంతాన్ని ముళ్ల బండ గా పిలుస్తారు.ఆ ప్రాంతంలో స్వామి వారి పాదాల ను ఉంచి పాదాల కట్టగా పిలుస్తారు.అక్కడ నుంచి షమీ వృక్షం వద్ద స్వామి వారు సేదతీరి ఉదయం వేకువ జాము వరకు ఎదురు బసవన్న గుడి వద్ద కు వెళ్లి మంచి చెడులు,పంటల ధరలను స్వామి వారు భవిష్యవాణి(కార్ణికంగా) వినిపించారని ఇదే భవిష్యవాణి ఇప్పట్టికి కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు.అక్కడి నుంచి సింహాసనం కట్ట వద్దకు చేరుకొని కొలువుదీరి భక్తుల కు దర్శనమివ్వడం తో జైత్రయాత్ర ముగుస్తుంది.
ఇనుప కర్రలు,అగ్ని దివిటీలు
బన్ని ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కొండల్లో వచ్చే భక్తులకు చీకటి అయ్యేదని ఆసమయంలో జంతువులు దాడి చేయకుండా ఉండేందుకు చేతిలో కర్ర,వెలుగు కోసం దివిటీలు చేతబూని ఉత్సవాలకు హాజరవుతారు.
800 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం లో పూజలు
800 అడుగుల ఎత్తుల్లో కొలువు ధీరీన పార్వతి,పరమేశ్వరుల ను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి,నెరణికి తాండ, కొత్తపేట,ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేసి ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కర్రలు ,అగ్ని ఖాగడాలు చేత బూని శివ,పార్వతుల కల్యాణం జరిపించి అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు.అప్పుడే బన్నీ కర్రల(సమరం)హోరాహోరీగా జరుగుతుంది.ఉత్సవ మూర్తులను తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడటం ఆక్రమంలో తలలు పగలడం ,వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీలో పాల్గొనడం విశేషం అదే క్రమంలో వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకుంటున్నారు.అయితే గ్రామస్థులు మాత్రం ఇది ఓ క్రీడా గా భావిస్తున్న భీకర కర్రల సమరం జరుగుతోంది.ఎప్పట్టికి నెరనికి గ్రామస్తులే ఉత్సవ మూర్తులను దక్కించుకుని తెల్ల వారు జాము వరకు పూజలు చేసి తిరిగి శివుడి ఆలయంలో ప్రతిష్టించి సింహాసనం కట్ట వద్ద అందరూ కలసి ఉత్సవాలు విజయవంతం అయ్యాయని కర్రల తో నృత్యాలు ,శబ్దం చేస్తూ బన్ని ఉత్సవం ముగిస్తారు.
యధావిధిగా పూజ,కల్యాణ కార్యక్రమాలు
దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయం లో ఈ నెల 12 న జరిగే పూజలు,స్వామి వారి కల్యాణం,భవిష్యవాణి,వంటి కార్యక్రమాలు ఆలయ కమిటీ పెద్దలు నిర్వహిస్తారని అధికార్లు వెల్లడించారు.
ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ పోలీస్ బలగాలు 7 మంది డిఎస్పీ లు,28 మంది సిఐ లు,73 మంది ఎస్ ఐ లు,,ఎ ఎస్ ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు222,పీసీలు 413,మహిళ పీసీ లు27,హోం గార్డ్ లు 224,స్పెషల్ పార్టీ,ఆర్మ్ డ్ ఫోర్స్, పాటు సీసీ ,డ్రోన్ కెమెరాలు,పరిసర గ్రామాల్లో పికెట్లు,చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *