Thalamadugu Prajapalana: ప్రజా పాలన గ్రామసభలను విజయవంతం చేయాలి..

సిరా న్యూస్, తలమడుగు:

ప్రజా పాలన గ్రామసభలను విజయవంతం చేయాలి..

-ఎంపీఓ దిలీప్ కుమార్

గ్రామ పంచాయతీలలో ఈనెల 28 నుంచి నిర్వహించనున్న ప్రజా పాలన గ్రామసభలను విజయవంతం చేయాలని ఎంపీవో దిలీప్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని సుంకిడి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. గ్రామ సభలలో లబ్ధిదారులు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అన్ని పథకాలకు ఒకటే దరఖాస్తు ఉంటుందని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. గ్రామసభలో దరఖాస్తుల కోసం శాఖల వారి కౌంటర్లు ఏర్పాటు చేయాలని, దరఖాస్తు దారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *