బాలికపై అత్యాచారం.. తర్వాత కాలువలో శవం

పోలీసులకు పిర్యాదు..అందని సహాయం..పైగా వేదింపులు
బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపణ
కాలువలో దొరికిన బాలిక శవం…గ్రామస్తుల ఆగ్రహం
కర్రలు చేతపట్టుకుని కదన రంగం లో దూకున అనేక మంది మహిళలు
బెంగాల్ లో మహిళలు సురక్షితంగా ఉండాలంటే మమతా బెనర్జీ ప్రభుత్వం దిగిపోవాలి
బిజెపి నాయకుడు అమిత్ మాలవియా డిమాండ్
సిరా న్యూస్,కోల్ కతా;
శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలిక తాలూకు శవం చివరికి ఓ కాలువలో దొరికింది. ఆ బాలికను బలాత్కరించి తర్వాత కాలువలో శవం పడేసి ఉంటారని ఆ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. దాంతో జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన మొదలయింది.రిపోర్టుల ప్రకారం ట్యూషన్ తరగతుల నుంచి తిరిగొస్తున్న బాలిక కనిపించకుండా పోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఫిర్యాదు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసుల నుంచి తమకు సహకారం దక్కగ పోగా వారి నుంచి వేధింపులు వచ్చాయని వారు ఆరోపించారు. ఆ తర్వాత ఉదయం ఆ బాలిక శవం దొరికింది. దాంతో పెద్ద ఎత్తున స్థానికు గుమిగూడారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదన్నారు. అనేక మంది మహిళలు కర్రలు చేతపట్టుకుని కదులుతున్న వీడియో ఇప్పుడు ఆన్ లైన్లో వైరల్ అయింది. వారంతా నిందితుడి మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వీడియోలో సకాలంలో ఫిర్యాదు ఎందుకు నమోదు చేయలేదంటూ స్థానికులు పోలీసులతో గొడవపడడం వైరల్ అయింది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఫిర్యాదు నమోదు చేయడంలో కూడా విఫలమవుతోందని బిజెపి నాయకుడు అమిత్ మాలవియా ‘ఎక్స్’ పోస్ట్ పెట్టారు. బెంగాల్ లో మహిళలు సురక్షితంగా ఉండాలంటే మమతా బెనర్జీ పోవాలని కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *