అంజన్న ను దర్శించుకున్న మహిళ అఘోర

సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని మహిళా అఘోర దర్శించుకున్నారు.లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తానని మహిళ అఘోర వెల్లడించారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. తాను వచ్చే మార్గమధ్యంలో వైకుంఠధామంలో పూజలు చేసినట్లు అలాగే పూజలు చేసిన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు మహిళ అఘోర. ఆలయాల సందర్శన కోసం హరిద్వార్ నుండి వచ్చినట్లు తెలంగాణలోని ఆలయాలన్నింటిని సందర్శిస్తానని తెలిపారు.
ఆలయ అర్చకులు ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *