సిరాన్యూస్, నాంపల్లి
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలి: ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు
* నాంపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నాంపల్లిలో ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మ జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్వపల్లి రాధా కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈసందర్బంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.