సిరా న్యూస్,డోన్;
ప్యాపిలి మండలం లోని పిఆర్ పల్లి గ్రామం దగ్గర జరిగిన సంఘటనలో వైసీపీ వారి పబ్లిసిటీ కి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టే కార్మికులు యువకులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఒకరు అక్కడే చనిపోగా మరొకరు హాస్పిటల్ లో చనిపోయారు వీరిలో ఒకరు మైనర్ అని తెలుస్తుంది. ప్యాపిలి మండలం పి ఆర్ పల్లె గ్రామం వద్ద ఫ్లెక్సీలు గ్రామ గ్రామానికి కట్టుకుంటూ వెళ్లే వాహనం వెనుక భాగంలో కూర్చున్న యువకులపై ఫ్లెక్సీలు పడటంతో వాహనం నుండి క్రిందపడి యువకులు చనిపోయారు. .