సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-ఇంటి పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలి

-మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్

సిరా న్యూస్,మంథని;
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉందాలని, పారిశుధ్య కార్యక్రమాలు అయిన ఫాగింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్ తదితర పనులను నిరంతరం జరపాలని మంథని డివిజనల్ పంచాయతీ అధికారి కే. సతీష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతి ని మంథని డివిజనల్ పంచాయతీ అధికారి కే. సతీష్ కుమార్ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి రాంకిషోర్ కు తగు సూచనలు జారీ చేశారు. స్మశాన వాటిక ను ఆయన సందర్శించి పరిసరాలను శుభ్రం చేయించాలని, బాత్రూం లలో నీటి వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.నిరంతరం ఇంటింటా చెత్త సేకరణ జరగాలని ఎస్ డబ్ల్యూ ఎం షెడ్ లో సెగ్రిగేషను ప్రక్రియ జరిగి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ప్లాస్టిక్ లేదా డ్రై వేస్ట్ ను అమ్మి అట్టి అమౌంట్ ను గ్రామపంచాయతీ ఖాతా యందు జమ చేయాలని సూచించారు. ఇంటి పన్ను వసూలు అక్టోబర్ 15 2024 లోపు వంద శాతం పూర్తిచేసి గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయవలసినదిగా ఆదేశించినారు.ఇట్టి ఆదేశాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన చో తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంకిషోర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *