2047 కోసం పక్కా ప్లానింగ్

సిరా న్యూస్;
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. తాజాగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ పెంపుకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 60 వేల కిలో మీటర్ల మేర నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసింది. విజన్ – 2047 అమల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఏపీతో పాటుగా తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. పలు నూతన ప్రాజెక్టులను ప్రకటించారుఇందులో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలైంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రజల సమస్యలు, సదుపాయాలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే బడ్జెట్‌లో అనేక వరాలు ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్‌ పెట్టింది. పలు రాష్ట్రాల్లో రోడ్లు, రైలు, పోర్టు కనెట్టివిటీ పెంచాలని నిర్ణయించింది. దాదాపు 60 వేల కిలోమీటర్ల మేర నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజన్‌ 2047లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులతో ఏపీతోపాటు తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది.కేంద్రం తాజాగా ఖరారు చేసిన హైస్పీడ్‌ కారిడార్లలో ఏపీ–తెలంగాణ మీదుగా పలు ప్రాజెక్టులకు స్థానం కల్పించింది. రెండు తెలుగు రాస్ట్రాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లను విస్తరించడంతోపాటు అంతర్గత రోడ్ల అనుసంధానానికి నిధులు కేటాయించింది. కేంద్రం ఖరారు చేసిన హై స్పీడ్‌ కారిడార్లలో ఏపీకి 9, తెలంగాణకు 6 ప్రాజెక్టులు దక్కాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. వీటిని రెండు దశల్లో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.ఇక కేంద్ర హైస్పీడ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంచాలపై కసరత్తు పూర్తి చేశారు. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్టు రూట్‌ మ్యాప్‌తోపాటు భూ సేకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ప్రాజెక్టులక సంబంధించి రెండు సంస్థల నుంచి కేంద్రం నివేదికలు సేకరించింది. మొత్తంగా దాదాపు 60 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్‌ రద్దీకి అనుగుణంగా ప్రణాళికలపై కసరత్తు సాగుతోంది. 2047 లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి రాయపూర్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ రానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాల పైన కసరత్తు పూర్తి చేసారు. అయితే, అధికారికంగా ఈ ప్రాజెక్టుల రూట్ మ్యాప్ తో పాటుగా భూ సేకరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ప్రాజెక్టులకు సంబంధించి రెండు సంస్థల నుంచి కేంద్రం నివేదికలు సేకరించింది. మొత్తం గా దాదాపు 60 వేల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం కు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలతో పాటుగా భవిష్యత్ రద్దీకి అనుగుణంగా ప్రణాళికల పైన కసరత్తు కొనసాగుతోంది. 2047 లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలనేది కేంద్రం లక్ష్యంగా ఉంది. తెలంగాణ లో హైదరాబాద్ నుంచి రాయపూర్ వరకు హైస్పీడ్ కారిడార్ రానుంది. అదే విధంగా నాగపూర్ – హైదరాబాద్ ప్రతిపాదన మరొకటి. హైదరాబాద్‌- విశాఖపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్దం చేసారు.అదేవిధంగా నాగపూర్‌ – హైదరాబాద్‌ ప్రతిపాదన మరొకటి. హైదరాబాద్‌–విశాఖపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్ధం చేశారు.పోర్టు కనెక్టివిటీల్లో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అందులో హైదరాబాద్‌ – బెంగళూరు ప్రతిపాదించిన మార్గం ఏపీలో 261 కి.మీ వరకు ఉంటుంది. ఖరగ్‌పూర్‌–కటక్‌–విశాఖపట్నం మార్గం ఒడిశా మీదుగా ఏపీ వరకు వస్తుంది. చౌటుప్పల్‌ ఎన్‌హెచ్‌–65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్ధమైంది. ఏపీ పరిధిలో 335 కిలోమీటర్ల మేర అతిపెద్ద హైస్పీడ్‌ కారిడార్‌ వైజాగ్‌–కాకినాడ–రామేశ్వరం–విజయవాడ–గుంటూరు–ఒంగోలు వరకు ఏర్పాట దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాకినాడ పోర్టునుంచి ఉప్పాడ బీచ్, నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి తంగలం, సూళ్లూరిపేట–మోమిడి వరకు రోడ్ల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *