సిరా న్యూస్,మంథని;
మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో 25 మంది గురుకుల విద్యార్థినులుకు అస్వస్థతకు గురయ్యారు. మంథని – ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఘటన జరిగింది. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనుమానిస్తున్నారు.